అనంతలో వైద్యం వికటించి మహిళ మృతి
ABN , First Publish Date - 2020-09-26T17:26:29+05:30 IST
నగరంలోని శ్రీనివాస ఆసుపత్రిలో వైద్యం వికటించి రాధ అనే మహిళ మృతి చెందింది.
అనంతపురం: నగరంలోని శ్రీనివాస ఆసుపత్రిలో వైద్యం వికటించి రాధ అనే మహిళ మృతి చెందింది. థైరాయిడ్ సమస్యతో శ్రీనివాస ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సింగణమల శ్రీపురంకు చెందిన రాధకు... థైరాయిడ్ ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అనస్తీసియా అధికమోతాదులో ఇవ్వడంతో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, బంధువులు.. శ్రీనివాస ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతి చెందిన మహిళలకు నలుగురు సంతానం. ఆమె మృతితో నలుగురు చిన్నారులు అనాధలయ్యారు.