అనంతపురం జిల్లాలో మీడియాపై ఆంక్షలు

ABN , First Publish Date - 2021-05-09T19:47:01+05:30 IST

అనంతపురం: జిల్లాలో మీడియాపై ఆంక్షలు విధించారు.

అనంతపురం జిల్లాలో మీడియాపై ఆంక్షలు

అనంతపురం: జిల్లాలో మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి మీడియాను అనుమతించకూడదని కలెక్టర్ గంధం చంద్రుడు జీవో విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ అందక పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితులు చనిపోతున్నారు. ఆస్పత్రుల్లోని లోపాలపై మీడియా కథనాలు ప్రసారం చేయడంతో ఆగ్రహించిన కలెక్టర్ మీడియాపై కత్తిగట్టారు. ఆస్పత్రుల్లోకి మీడియాను నిషేధిస్తూ జీవో తెచ్చారు. దీంతో కలెక్టర్ తీరుపై విమర్ళలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం కోర్టు సయితం మీడియాపై ఆంక్షలు ఉండకూడదని చెబుతున్నా.. కలెక్టర్ ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-05-09T19:47:01+05:30 IST