యూఎస్ రెస్టారెంట్‌పై కుమార్ మంగళం బిర్లా కుమార్తె తీవ్ర ఆరోపణలు!

ABN , First Publish Date - 2020-10-26T18:50:21+05:30 IST

భారతీయ బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా అమెరికన్ రెస్టారెంట్ 'స్కోపా ఇటాలియన్ రూట్స్'పై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.

యూఎస్ రెస్టారెంట్‌పై కుమార్ మంగళం బిర్లా కుమార్తె తీవ్ర ఆరోపణలు!

న్యూఢిల్లీ: భారతీయ బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా అమెరికన్ రెస్టారెంట్ 'స్కోపా ఇటాలియన్ రూట్స్'పై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ యూఎస్ రెస్టారెంట్ తనతో పాటు తన కుటుంబంపై జాత్యహంకారానికి పాల్పడిందని ఆరోపించారు. రెస్టారెంట్ వారు తమను కనీసం వారి ప్రాంగణంలో కూడా ఉండనివ్వకుండా గెంటివేశారని ఆమె పేర్కొన్నారు. "ఈ రెస్టారెంట్ మాతో నిజంగా దారుణంగా ప్రవర్తించింది. నన్ను, నా ఫ్యామిలీని రెస్టారెంట్ ప్రాంగణం నుంచి గెంటివేసింది. ఇది ముమ్మాటికి జాత్యహంకారమే. చాలా బాధాకరం. ఇది సరైన పద్దతి కాదు." అని అనన్య ట్వీట్ చేశారు. అలాగే అక్కడి వెయిటర్ తన తల్లితో చాలా మొరటుగా వ్యవహరించాడని కూడా ఆమె ఆరోపించారు. 



Updated Date - 2020-10-26T18:50:21+05:30 IST