సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలి
ABN , First Publish Date - 2022-05-18T03:45:21+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు చర్యలు
- ఎమ్మెల్యే మహీధర్రెడ్డి
లింగసముద్రం, మే 17: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు చర్యలు తీసుకోవాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని ఎర్రారెడ్డిపాలెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏవైనా పథకాలు అందించటంలో లోపం జరుగుతుంటే తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని కోరారు. కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ రైతు భరోసా సొమ్ము జమకాలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రెండు మూడురోజుల్లో రైతులందరికీ జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్ర మంలో తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి, ఎంపీపీ పెన్నా కృష్ణయ్య, సర్పంచు మల్లికార్జున, తిమ్మారెడ్డిపాలెం ఎంపీటీసీ దగ్గు వెంకటేశ్వర్లు, కొండారెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.