‘రాష్ట్రంలో అరాచక పాలన’

ABN , First Publish Date - 2022-06-25T05:57:49+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అరాచ‌క పాల‌న సాగిస్తోంద‌ని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు.

‘రాష్ట్రంలో అరాచక పాలన’
మాట్లాడుతున్న‌ గౌరు చ‌రితారెడ్డి

నంద్యాల (నూనెపల్లె), జూన్‌ 24: రాష్ట్రంలో వైసీపీ అరాచ‌క పాల‌న సాగిస్తోంద‌ని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. గడివేముల మండలం ఎల్‌కే తండాలో గిరిజన మహిళపై వైసీపీ నాయకుల దౌర్జన్యం,అరాచకంతో అక్రమ కేసులు బనాయించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమన్నారు. జరిగిన ఘటనపై ఎస్పీ రఘువీర్‌రెడ్డిని ఆమె కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. బాధితురాలు గత 30 ఏళ్ల నుంచి గ్రామంలో రేషన్‌ డీలర్‌గా పనిచేస్తున్నారని, అయితే రేషన్‌ డీలర్‌షిప్‌ను వైసీపీ నాయకులకు కైవసం చేసుకునేందుకు ఆమెపై అక్రమ కేసులు బనాయించడంఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేయాలని, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2022-06-25T05:57:49+05:30 IST