రూ.25 కోట్ల విలువైన ప్రాచీన మరకతపచ్చ శివలింగం స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-18T07:58:56+05:30 IST

ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో పోలీసులు అరెస్టు చేశారు.

రూ.25 కోట్ల విలువైన ప్రాచీన మరకతపచ్చ శివలింగం స్వాధీనం

చెన్నై, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో  పోలీసులు అరెస్టు చేశారు.  నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్‌ బాలా (46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్‌ నగర్‌కు చెందిన భాగ్యరాజ్‌ (42)గా గుర్తించారు. లోహపు నాగాభరణంతో కూడిన ఈ మరకతపచ్చ శిల శివలింగం సుమారు పది కేజీల బరువున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిలోని గరుడాళ్వార్‌ రూపాన్నిబట్టి ఆ విగ్రహం నేపాల్‌కు చెందినదని, ఐదువందల సంవత్సరాలనాటిదని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-05-18T07:58:56+05:30 IST