అందరూ ఉన్నా ఒంటరి!

ABN , First Publish Date - 2021-12-12T02:43:24+05:30 IST

పక్షవాతంతో కాలూచేయీ పనియచేయకపోవడం, కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోకపోవడంతో కండలేరు ముంపు గ్రామమైన గుండవోలులో బొమ్మిరెడ్డి భాస్కరరెడ్డి (50) పక్షం రోజులుగా బతుకుపోరాటం చేస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అందరూ ఉన్నా ఒంటరి!
మంచానికే పరిమితమైన భాస్కరరెడ్డి

 అనారోగ్యంతో మంచంమీదే వెతలు

తిండి, నీళ్లు లేక ఆగచాట్లు

 గుండవోలులో ఒంటరి నిర్వాసితుడి అగచాట్లు

రాపూరు, డిసెంబరు 11: పక్షవాతంతో కాలూచేయీ పనియచేయకపోవడం, కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోకపోవడంతో కండలేరు ముంపు గ్రామమైన గుండవోలులో బొమ్మిరెడ్డి భాస్కరరెడ్డి (50) పక్షం రోజులుగా బతుకుపోరాటం చేస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతంగా జీవించిన ఆయన నేడు ఆకలితో అలమటిస్తున్నట్లు  వాపోతున్నారు.  భాస్కరరెడ్డి వివాహం చేసుకోలేదు. తల్లిదండ్రులు  మరణించడంతో తోబుట్టువు చూసుకునేది. ప్రభుత్వం ఇచ్చిన్న ముంపు పరిహారం సైతం   తీసేసుకున్న బంధువులు ప్రస్తుతం పట్టించుకోకపోవడంతో 15 రోజులుగా మంచంమీదే ఉన్నాడని, దీంతో దుర్గంధం వెలువడుతోందని అంటున్నారు.  ఒకట్రెండు రోజులు పట్టించుకోకుంటే పరిస్థితి తీవ్రమవుతుందని, అధికారులో, పాలకులో ఎవరో ఒకరు స్పందించి బాధితుడిని ఆసుపత్రికి చేర్చాలని కోరుతున్నారు. ఈ విషయమై వైసీపీ నాయకుడు గంగోటి ఆనంద్‌ మాట్లాడుతూ తమతో కలసి తిరిగిన వ్యక్తి పరిస్థితి ఇలా మారడం తాము చూడలేక పోతున్నామన్నారు. బంధువులకు ఫోన్‌ చేసినా స్పందించడం లేదన్నారు.  అధికారులు స్పందించి ఆసుపత్రికి చేర్చి ఆదుకోవాలని గ్రామస్థులు ముక్తకంఠంతో కోరుతున్నారని వివరించారు. 


Updated Date - 2021-12-12T02:43:24+05:30 IST