జగన్ చేతిని ముద్దాడిన రోజా
ABN , First Publish Date - 2022-04-11T21:11:08+05:30 IST
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జగన్ మంత్రివర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జగన్ మంత్రివర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. కొత్త మంత్రులచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రోజా కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి ఆయన చేతిని ముద్దుపెట్టుకున్నారు. సీఎం ఆమెను ఆశీర్వదించారు.
ఇక నుంచి టీవీ షోలు బంద్: రోజా
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆర్కే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి టీవీ షోలు బంద్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే బజర్తస్త్ షోలకు కూడా గుడ్ బై చెప్పనున్నారు. రోజా గత పదేళ్లుగా జబర్తస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జగనన్న ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తానని రోజా ప్రకటించారు.