Mangalagiri నియోజకవర్గంలో ఆ అధికారిణి దారుణాలు..: MS Raju

ABN , First Publish Date - 2022-06-10T18:37:17+05:30 IST

మంగళగిరి నియోజకవర్గంలో ఆ అధికారిణి దారుణాలు అంతింత కాదని టీడీపీ నేత ఎమ్ఎస్ రాజు విమర్శించారు.

Mangalagiri నియోజకవర్గంలో ఆ అధికారిణి దారుణాలు..: MS Raju

Guntur: మంగళగిరి నియోజకవర్గంలో ఆ అధికారిణి దారుణాలు అంతింత కాదని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు (MS Raju) ట్విట్టర్ (Twitter) వేదికగా ఆరోపించారు. తాడేపల్లి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ హేమ మాలిని రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆర్కేతో కుమ్మక్కై మూడేళ్లుగా ఒకే చోట పోస్టింగ్ వేయించుకుని, ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్‌గా మారి పేదల ఇళ్లు కూల్చడం, పేదల నోటి దగ్గర కూడు లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పేదల ఇళ్లు, అన్న క్యాంటీన్లు కూల్చే ఆమెకి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చెరువులను సైతం కబ్జా చేసి భవనాలు కడుతున్నా కనపడకపోవడం వింతేనన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆమె చేస్తున్న అవినీతికి అంతే లేదన్నారు. టీడీపీ  అధికారంలోకి వచ్చిన తర్వాత హేమ మాలిని రెడ్డి అక్రమాస్తులపై విచారణ చేయడం, వాటిని ఇదే జేసీబీతో కూల్చడం ఖాయమని ఎంఎస్ రాజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-06-10T18:37:17+05:30 IST