Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

ABN , First Publish Date - 2022-08-11T01:39:00+05:30 IST

శ్రీశైలం జలాశయానికి బుధవారం వరద ప్రవాహం భారీగా నమోదయింది. దీంతో డ్యాం అధికారులు పది క్రస్టు గేట్లను పది అడుగుల మేర

Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి బుధవారం వరద ప్రవాహం భారీగా నమోదయింది. దీంతో డ్యాం అధికారులు పది క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,77,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.40 అడుగులు నీరు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా నమోదయింది. జూరాల నుంచి 221,143 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,56,766 క్యూసెక్కులు కలిపి జలాశయానికి మొత్తం 3,77,909 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 30,091 క్యూసెక్కులు, తెలంగాణ (Telangana) విద్యుత్‌ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు, డ్యామ్‌ ఐదు క్రస్టు గేట్ల ద్వారా 2,77,540 క్యూసెక్కులు మొత్తంగా 339,415 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌(Nagarjuna Sagar)కు వదులుతున్నారు.

Updated Date - 2022-08-11T01:39:00+05:30 IST