APNews: లక్కవరంలో రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2022-06-15T19:37:47+05:30 IST
జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరంలో రైతుల ఆందోళనకు దిగారు.
ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరంలో రైతులు ఆందోళనకు దిగారు. లక్కవరం యూనియన్ బ్యాంకును ముట్టడించిన రైతులు... బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉండవల్లి రవిశంకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నగదు రూ.68 లక్షలు గోల్మాల్ చేశారని ఆరోపించారు. రైతుల నగదు వారి ఖాతాల్లో జమ చేయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చచెప్పేందుకు యత్నిస్తున్నారు.