ఏపీలో భోగీ, సంక్రాంతి, కనుమ సెలవుల తేదీల్లో మార్పులు

ABN , First Publish Date - 2022-01-12T01:33:32+05:30 IST

భోగీ, సంక్రాంతి, కనుమ సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత జనవరి 14, 15, 16వ తేదీలను సెలవులుగా..

ఏపీలో భోగీ, సంక్రాంతి, కనుమ సెలవుల తేదీల్లో మార్పులు

అమరావతి: భోగీ, సంక్రాంతి, కనుమ సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత జనవరి 14, 15, 16వ తేదీలను సెలవులుగా ప్రకటించింది. ఈ తేదీలకు బదులుగా 13,14,15వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ తాజాగా సవరణ జీవోను విడుదల చేసింది. 


కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. సోమవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చిన నైట్ కర్ఫ్యూని ఎత్తేసి సంక్రాంతి తర్వాత జనవరి 18 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను సవరించి తాజాగా జీవో జారీ చేసింది. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో పల్లెలకు ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-01-12T01:33:32+05:30 IST