మాజీ డీజీపీ ప్రసాదరావు అనారోగ్యంతో అమెరికాలో మృతి

ABN , First Publish Date - 2021-05-10T19:37:45+05:30 IST

మాజీ డీజీపీ ప్రసాదరావు అనారోగ్యంతో అమెరికాలో మృతి

మాజీ డీజీపీ ప్రసాదరావు అనారోగ్యంతో అమెరికాలో మృతి

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీగా సేవలందించిన ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ బి. ప్రసాదరావు అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూశారు. గత రాత్రి ప్రసాదరావుకు గుండెనొప్పి రావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు ప్రసాదరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన విశాఖ ఎస్పీగా, హైదరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1997లో భారత పోలీసు, 2006లో రాష్ట్రపతి అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకాన్ని కూడా ఈయన రచించారు. 


Updated Date - 2021-05-10T19:37:45+05:30 IST