శ్రీశైలంలో హైకోర్టు జడ్జి
ABN , First Publish Date - 2022-10-03T06:17:08+05:30 IST
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ రవినాథ్ తిల్హ్రి దర్శించుకున్నారు.
శ్రీశైలం, అక్టోబరు 2: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ రవినాథ్ తిల్హ్రి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న జడ్జికి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్.లవన్న, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జడ్డి స్వామి, అమ్మవార్ల దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.