AP: జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం వాయిదా

ABN , First Publish Date - 2022-01-08T16:34:34+05:30 IST

రేపు జరగాల్సిన జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం వాయిదా పడింది.

AP: జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం వాయిదా

అమరావతి: రేపు జరగాల్సిన జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం వాయిదా పడింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున వాయిదా వేసినట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఈనెల 9న సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నట్లు తొలుత ప్రకటించారు. కాగా... మూడు రోజుల నుంచి పెరుగుతున్న కేసులతో పార్టీ పునరాలోచనలో పడింది. కార్యకర్తలు, అభిమానుల శ్రేయస్సు దృష్ట్యా వాయిదా వేసినట్లు ప్రకటన వెలువడించారు. తదుపరి సమావేశానికి సంబంధించి త్వరలో  వివరాలు తెలియజేస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2022-01-08T16:34:34+05:30 IST