ఏపీ రాజకీయ పరిణామాలపై జయప్రకాష్‌ నారాయణ ఆవేదన

ABN , First Publish Date - 2021-10-23T23:36:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై జయప్రకాష్‌ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. భావోద్వేగాలు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. అనాగరిక భాషను ..

ఏపీ రాజకీయ పరిణామాలపై జయప్రకాష్‌ నారాయణ ఆవేదన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై జయప్రకాష్‌ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. భావోద్వేగాలు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. అనాగరిక భాషను వాడటం, హింసకు దిగడం దురదృష్టకరమన్నారు. ప్రతివారూ ఇతరుల్లో తప్పుల్ని చూస్తున్నారని, రాజకీయాల్లో ఈ వేడి తగ్గాలని.. ప్రశాంతత కావాలని చెప్పారు. ప్రభుత్వానికి, సీఎంకు, ప్రతిపక్షనేతకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ‘‘మీ మధ్య రాజుకుంటున్న కోపాగ్నికి సామాన్యులు బలవుతున్నారు. సామరస్య వాతావరణాన్ని తీసుకురండి. రాష్ట్రం అనేక సమస్యల్లో ఉంది.’’ అని జయప్రకాష్‌ నారాయణ అన్నారు. 




Updated Date - 2021-10-23T23:36:26+05:30 IST