కరోనా కంటే చంద్రబాబు ప్రమాదకరం: కన్నబాబు
ABN , First Publish Date - 2022-01-13T00:53:29+05:30 IST
కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలకు..
కాకినాడ: కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. అధికారం లేక చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చి పార్టీ పెడుతున్నారని తెలిసి చంద్రబాబు ఎన్నో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని చెప్పారు. పరోక్షంగా న్యాయ వ్యవస్థపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో చంద్రబాబు నిస్థాగరిస్టుడని కన్నబాబు విమర్శించారు.