జగన్ ప్రభుత్వానికి పవర్ పంచులు
ABN , First Publish Date - 2021-10-18T01:10:17+05:30 IST
సోషల్ మీడియా ప్రచారం దెబ్బకు ఏపీ ప్రభుత్వానికి తల బొప్పి కడుతోంది. తాజాగా ఈ సోషల్ ఫైట్ ఏపీ ఇంధన శాఖకు ...
హైదరాబాద్: సోషల్ మీడియా ప్రచారం దెబ్బకు ఏపీ ప్రభుత్వానికి తల బొప్పి కడుతోంది. తాజాగా ఈ సోషల్ ఫైట్ ఏపీ ఇంధన శాఖకు షాక్ ఇచ్చింది. దీంతో హడావుడిగా ఆ శాఖ విద్యుత్ కోతలపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని సుదీర్ఘ ప్రకటన జారీ చేసింది. అయితే ఆ ప్రకటన ఆద్యంతం కోతల్కేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పారే తప్ప కోతలు ఉండవని స్పష్టం చేయలేకపోయారు. ఒక వేళ కోతలు ఉంటే ఆ సమాచారాన్ని వెంటనే ఎలక్రానిక్ మీడియా ద్వారా వెల్లడిస్తామని ఆ ప్రకటనలో తెలపడం కొనమెరుపు.
ఏపీలో సోషల్ ప్రచారం దెబ్బకు ఇంధన శాఖ షాక్కు గురైంది. ఏపీలో పవన్ సంక్షోభంపై ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసిన నాటి నుంచే సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వానికి పవర్ పంచులు పడుతున్నాయి. పవర్ కట్ ప్రచారం వల్ల ఇంధనశాఖపై పడుతున్న పవర్ పంచులపై ఎట్టకేలకు ఇంధన శాఖ స్పందించింది. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో పవర్ కట్లు అమల్లోకి వస్తాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలు నమ్మెద్దని పేర్కొంది.