ఆ నాలుగు కార్పొరేషన్లపై ఎస్ఈసీ ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2021-03-06T16:05:20+05:30 IST

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమకు అందిన ఫిర్యాదులపై

ఆ నాలుగు కార్పొరేషన్లపై ఎస్ఈసీ ప్రత్యేక దృష్టి

అమరావతి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమకు అందిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్‌కు కోడ్ ఉల్లంఘనలపై అనేక ఫిర్యాదులు అందగా, నగదు పంపిణీ, మద్యం సరఫరాపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని ప్రకటనలో తెలిపింది. కోడ్ ఉల్లంఘనలు జరగకుండా ప్రత్యేక టీమ్‌లను తక్షణం రంగంలోకి దించాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో అప్రమత్తం అయ్యింది. ఈ ఫిర్యాదులకు సంబంధించి ఈ నెల 7న  అధికారులతో ఎన్నికల కమిసనర్ టేలికాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఈ ఫిర్యాదులపై ఆదాయపు పన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-03-06T16:05:20+05:30 IST