AP: నిర్మాణంలో ఉన్న భవనంలో వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-11-27T13:32:18+05:30 IST
కృష్ణా జిల్లా గుడివాడ శ్రీరాంపురంలో నిర్మాణ దశలో ఉన్న ఐడు అంతస్తుల భవనం పెంట్ హౌస్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ శ్రీరాంపురంలో నిర్మాణ దశలో ఉన్న ఐదు అంతస్తుల భవనం పెంట్ హౌస్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి సుమారు నెల రోజుల క్రితం మృతి చెందడంతో మృతదేహం కలేభరంగా మారినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని 1 టౌన్ సీఐ గోవిందరాజులు తెలిపారు. మృత కళేబరం ఉన్న చోటే పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్పారు.