సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా
ABN , First Publish Date - 2021-07-27T04:08:00+05:30 IST
ఆత్మకూరు సీడీపీవో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ సిబ్బంది ధర్నా చేశారు. అంగన్వాడీలకు సెల్ఫోన్,
ఆత్మకూరు, జూలై 26: ఆత్మకూరు సీడీపీవో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ సిబ్బంది ధర్నా చేశారు. అంగన్వాడీలకు సెల్ఫోన్, ట్యాబ్లను అందచేయాలని డిమాండ్ చేశా రు. అంగన్వాడీ కేంద్రం నిర్వాహణను యాప్లో నమోదు చేయాల్సి ఉండడంతో పాటు లబ్ధిదారులచే బయోమెట్రిక్ వేయించకుంటే వేతనాలు కట్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా బెదిరింపులతో మానసిన ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీడీపీవో కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సీఐటీయూ మండల కార్యదర్శి కె.హజరత్తయ్య, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆత్మకూరు ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శి షకీల, రాధమ్మ, సెక్టార్ లీడర్లు సుప్రజ, విజయమ్మ, మస్తానమ్మ, రమణమ్మ పాల్గొన్నారు.