అంగన్వాడీ పోస్టుల భర్తీకి 27,28 తేదీల్లో ఇంటర్వ్యూలు
ABN , First Publish Date - 2021-01-22T05:24:36+05:30 IST
జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు అధికారులు తేదీలను ప్రకటించారు.
ఒంగోలు నగరం, జనవరి 21: జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు అధికారులు తేదీలను ప్రకటించారు. ఈనెల 27,28 తేదీల్లో స్థానిక డ్వామా కా ర్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 820 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబర్లో నోటిఫి కేషన్ జారీ చేశారు. అయితే, అధికారులు భర్తీ ప్రక్రియను జాప్యం చేశారు. ది వ్యాంగులకు కేటాయించిన పోస్టులకు ఎ క్కువ చోట్ల దరఖాస్తులు అందలేదు. దీంతో పాటు అంగన్వాడీ విధులను దివ్యాంగులు నిర్వర్తించలేరంటూ, వారికి కే టాయించిన పోస్టులను జనరల్ కేటగిరీకి బదిలీ చేయాలంటూ అధికారులకు వి జ్ఞప్తులు అందాయి. దీంతో అనుమతి కోరుతూ ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవటంతో ది వ్యాంగులకు కేటాయించిన పోస్టుల్లో దరఖాస్తులు అందని పోస్టులను వదిలేసి ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 27,28 తేదీల్లో ఇంటర్వ్యూ లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 27న కందుకూరు, మార్కాపు రం, 28న ఒంగోలు డివిజన్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. కలెక్టర్ చైర్మన్గా, ఐసీడీ ఎస్ పీడీ కన్వీనర్గా ఉన్న కమిటీ ఈ ఇంటర్వ్యూ లను నిర్వహించనుంది.