అంగన్‌వాడీ టీచర్లు తల్లిపాత్ర పోషించాలి

ABN , First Publish Date - 2022-01-21T07:17:39+05:30 IST

అంగన్‌వాడీ టీచర్లు తల్లిపాత్ర పోషించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు అన్నారు.

అంగన్‌వాడీ టీచర్లు తల్లిపాత్ర పోషించాలి
బట్లపల్లిలో చిన్నారులతో మాట్లాడుతున్న అంజన్‌రావు

మర్రిగూడ, జనవరి 20: అంగన్‌వాడీ టీచర్లు తల్లిపాత్ర పోషించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు అన్నారు. మండలంలోని బట్లపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించి, కేంద్రంలో ఉన్న సమస్యలను అంగన్‌వాడీ టీచర్‌ అండాలును అడిగి తెలుసుకున్నారు. కరోనా విజృంభిస్తున్నందున టీచర్లు చిన్నారులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. తల్లిదండ్రులకు కూడ కరోనాపై అవగాహన కల్పించాలని కోరారు. పిల్లలకు ప్రభుత్వం అందించే పోషక ఆహారాలను తప్పనిసరిగా అందించాలని సూచించారు. అంతకుముందు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ ఆవరణలో పీఆర్‌టీయూఎస్‌ క్యాలెండర్‌, డైరీలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు వారి హక్కుల సాధన కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అదేవిధంగా వట్టిపల్లి గ్రామంలో ఇటీవల విద్యుదాఘాతానికి గురైన నర్సింహ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ కటుకూరి వెంకటేష్‌, ఎంపీడీవో రమే్‌షధీన్‌దయాల్‌, తహసీల్దార్‌ దేస్యానాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T07:17:39+05:30 IST