ఇంటిపని సరిగా చేయలేదని పనిమనిషిపై యజమానురాలు కత్తితో దాడి

ABN , First Publish Date - 2020-08-04T16:52:20+05:30 IST

ఇంటి పని సరిగా చేయలేదని పనిమనిషిపై యజమానురాలు కత్తితో దాడి చేసిన ఘటన....

ఇంటిపని సరిగా చేయలేదని పనిమనిషిపై యజమానురాలు కత్తితో దాడి

అహ్మదాబాద్ : ఇంటి పని సరిగా చేయలేదని పనిమనిషిపై యజమానురాలు కత్తితో దాడి చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రీతికుమారి(25) అహ్మదాబాద్ నగరంలోని కల్యాణి అనే యజమానురాలి ఇంట్లో నాలుగేళ్లుగా పనిచేస్తోంది. పనిమనిషి సరిగా పనిచేయలేదనే కోపంతో యజమానురాలైన కల్యాణి పనిమనిషి ప్రీతికుమారిపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో ప్రీతికుమారి చేతికి తీవ్ర గాయమై రక్తం వచ్చింది. భయంతో ప్రీతికుమారి బయటకు పరుగులు తీయగా స్థానికులు ఆమెను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ప్రీతికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేర యజమానురాలైన కల్యాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-08-04T16:52:20+05:30 IST