TS News: పోలీసులపై కోపంతో..ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-10-03T23:50:30+05:30 IST

Hyderabad: ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై ఓ వాహనదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ట్రాఫిక్ పోలీసులు మైత్రివనం దగ్గర ఓ వాహనదారుడిని ఆపారు

TS News: పోలీసులపై కోపంతో..ఏం చేశాడంటే..

Hyderabad: ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై ఓ వాహనదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ట్రాఫిక్ పోలీసులు మైత్రివనం దగ్గర ఓ వాహనదారుడిని ఆపారు. దగ్గరకు వచ్చి బైక్‌ తాళం తీసేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన వాహనదారుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం వాహనదారుడు తన బండిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఎందుకు ఇలా చేశాడో కారణం తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-10-03T23:50:30+05:30 IST