‘వన్య ప్రాణుల వేటను పట్టించుకోని అధికారులు’
ABN , First Publish Date - 2021-01-24T05:54:01+05:30 IST
‘వన్య ప్రాణుల వేటను పట్టించుకోని అధికారులు’
తాండూరు: కొన్ని సంవత్సరాలుగా వన్య ప్రాణుల వేట కొనసాగుతున్నా అటవీశాఖ గానీ, ఇతర యంత్రాంగం పట్టించుకోవడం లేదని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమే్షకుమార్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ అడవులకు జల్సాల కోసం వచ్చే ఎంతో మంది వన్యప్రాణులను రాత్రివేళల్లో తుపాకులతో చంపుతున్నా అడిగే నాథుడే లేడన్నారు. యాలాల మండలంలో బుల్లెట్ మ్యాగ్జిన్ లభించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.