కమీషన్లు లెక్క లేసుకునే మంత్రి లోకేష్ గురించి మాట్లాడటం విడ్డూరం
ABN , First Publish Date - 2021-03-08T06:03:56+05:30 IST
రాష్ట్రంలో మద్యం, ఇసుక, ల్యాండ్ వ్యా పారాల్లో కమీషన్ లెక్కలేసుకుంటూ ప్రజలకు సేవ చేసే తీరిక లేని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నారా లోకేష్ గురించి మాట్లాడటం గురుగింజ సా మెతలా గా ఉందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురా లు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు.
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ధ్వజం
ఒంగోలు (కార్పొరేషన్) మార్చి 7 : రాష్ట్రంలో మద్యం, ఇసుక, ల్యాండ్ వ్యా పారాల్లో కమీషన్ లెక్కలేసుకుంటూ ప్రజలకు సేవ చేసే తీరిక లేని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నారా లోకేష్ గురించి మాట్లాడటం గురుగింజ సా మెతలా గా ఉందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురా లు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. ఆది వారం ఒంగోలులోని టీడీపీ జిల్లా కార్యాలయ ంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వై ఫల్యాలను తమ నాయకుడు నారా లోకేష్ ప్రశ్నిస్తుంటే చేతకాని అసమర్ధ సీఎం తన మంత్రి వర్గాన్ని కమీషన్ల వసూళ్ళకే ఏర్పాటు చేసినట్లుగా ఉందన్నారు. అభివృద్ధి చేయడం చేతకాని మంత్రి బాలినేని, దామచర్ల జనార్ద న్ను వ్యక్తిగతంగా దూషించడం ఆయన అస మర్ధతకు నిదర్శనమన్నారు. ఒంగోలు నియో జకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం మంత్రి బాలినేనికి ఉందా అని ప్రశ్నిం చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలులో జరిగిన నారా లోకేష్ పర్యటనకు ప్రజల నుంచి ఆదర ణ లభించడంతో ఓర్వలేని మంత్రి ఇష్టమొచ్చి నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అ భివృద్ధి చేయడం చేతకాని మంత్రి బాలినేని ప్రజలను ఓటు అడిగే అర్హత లేదన్నారు. జి ల్లా రాజకీయాల్లో దామచర్ల కుటుంబం స చ్ఛిలత గురించి ప్రజలకు తెలుసని, తమ గు రించి మాట్లాడే అర్హత లేదని హితవు పలి కారు. సమావేశంలో పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, అధికార ప్రతినిధి గూ డూరి ఎరిక్షన్బాబు పాల్గొన్నారు.