మహిళా సంక్షేమం పేరుతో జగన్ ముసలి కన్నీరు: అనిత

ABN , First Publish Date - 2021-03-08T21:32:03+05:30 IST

మహిళా సంక్షేమం పేరుతో సీఎం జగన్మోహన్‌రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అన్నారు.

మహిళా సంక్షేమం పేరుతో జగన్ ముసలి కన్నీరు: అనిత

కృష్ణా: మహిళా సంక్షేమం పేరుతో సీఎం జగన్మోహన్‌రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అన్నారు. సోమవారం గన్నవరం తెలుగుదేశం కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనిత హాజరయ్యారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ క్లిష్ట కాలంలో అండగా ఉన్న మహిళా నేతలను సన్మానించారు..ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని స్థానికులతో పంచుకున్నారు. 


సొంత చెల్లిని, బాబాయ్ కూతురు‌ని గౌరవించని వ్యక్తి సీఎం జగన్.. రాష్ట్ర మహిళలను ఏవిధంగా గౌరవిస్తాడని మండిపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న కాగితాలను లాక్కున్న రోజాని గౌరవించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. స్త్రీల పట్ల గౌరవం కలిగిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. మహిళలను దుర్గ గుడి‌కి వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు దుర్గ గుడికి పోవాలంటే ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాల అని ప్రశ్నించారు. రాజధాని మహిళల వస్త్రాలు చినిగిపోయిన పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అనిత పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-08T21:32:03+05:30 IST