మంత్రి పెద్దిరెడ్డి అగౌరవంగా మాట్లాడుతున్నారు: డాక్డర్ అనితారాణి
ABN , First Publish Date - 2020-09-26T20:23:46+05:30 IST
మంత్రి పెద్దిరెడ్డి అగౌరవంగా మాట్లాడుతున్నారు: డాక్డర్ అనితారాణి
అమరావతి: డాక్టర్ సుధాకర్పై కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని డాక్డర్ అనితారాణి అన్నారు. సుధాకర్కు మోడిలేటర్స్ ఇచ్చి బ్యాలెన్స్ తప్పేలా చేశారని చెప్పారు. తమకు పోలీస్ రక్షణ లేదన్నారు. లైసెన్స్ గన్ ఇవ్వాలని రాష్ట్రపతికి లేఖ రాశామని తెలిపారు. దళితుల మీద దాడులు జరిగితే డబ్బులు ఇచ్చి కప్పి పెడుతున్నారని మండిపడ్డారు. దళితులు ఇలాంటి వాటికి లొంగకూడదని ఆమె సూచించారు. మంత్రి పెద్దిరెడ్డి అగౌరవంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.