నెట్టికంటికి ఎండు ఫలాల అలంకరణ

ABN , First Publish Date - 2022-05-24T06:09:24+05:30 IST

దక్షిణాది హనుమజ్జయంత్యుత్సవాలను పురస్కరించుకుని, నెట్టికంటి ఆంజనేయుడిని ఎండు ఫలాలతో అలంకరించారు.

నెట్టికంటికి ఎండు ఫలాల అలంకరణ

గుంతకల్లు, మే 23: దక్షిణాది హనుమజ్జయంత్యుత్సవాలను పురస్కరించుకుని, నెట్టికంటి ఆంజనేయుడిని ఎండు ఫలాలతో అలంకరించారు. స్వామివారికి సోమవారం ఉదయం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో వాస్తు, యోగిని, నవగ్రహ, సర్వత్రోభద్ర మండల, ప్రధాన దేవతా ఆరాధనలు, వాస్తు హోమం, సుందరకాండ, మన్యుసూక్త పారాయణ, శ్రీరామ ఆంజనేయ స్వాముల మూల మంత్రానుష్టానాలు, నీరాజన మంత్ర పుష్ప కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ముఖ మండపంలో ఉంచి లక్ష సింధూరార్చన నిర్వహించారు. వేడుకలను భ క్తులు కన్నులారా వీక్షించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్‌పర్సన సుగుణమ్మ, ఆలయ ప్రధానార్చకుడు గరుడాచార్యులు, అర్చకులు, పరిచారకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T06:09:24+05:30 IST