హైదరాబాద్లో దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త
ABN , First Publish Date - 2021-01-21T23:43:53+05:30 IST
రాయదుర్గం పీఎస్ పరిధిలోని అంజయ్యనగర్లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త మోసిన ఖాన్ కత్తితో పొడిచి హత్య చేశాడు..
హైదరాబాద్: రాయదుర్గం పీఎస్ పరిధిలోని అంజయ్యనగర్లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త మోసిన ఖాన్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అక్కడికక్కడే భార్య ఫర్హాన ఖురేషి(25) ప్రాణాలు వదిలింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఫర్హాన ఖురేషి 5 నెలల క్రితం మోసిన ఖాన్తో ప్రేమ వివాహం జరిగింది. మృతురాలు ఇదివరకే ఇద్దరిని వివాహం చేసుకొని విడాకులు తీసుకుంది. మోసిన ఖాన్తో వివాహం తర్వాత చెడు అలవాట్లకు లోనైందన్న అనుమానంతో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. దీంతో నిన్న అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి మాట మాట పెరిగి హత్యకు దారితీసింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు.. మృతురాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.