AP News: సజ్జల వ్యాఖ్యలు సిగ్గుచేటు: శ్యామ్ చంద్ర శేషు

ABN , First Publish Date - 2022-08-27T00:52:51+05:30 IST

కుప్పంలో అన్న క్యాంటీన్‌ (Anna canteen)పై వైసీపీ (YCP) నేతల దాడిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఖండించారు.

AP News: సజ్జల వ్యాఖ్యలు సిగ్గుచేటు: శ్యామ్ చంద్ర శేషు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): కుప్పంలో అన్న క్యాంటీన్‌ (Anna canteen)పై వైసీపీ (YCP) నేతల దాడిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఖండించారు. పేదల కోసం ఏర్పాటు చేసిన   అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) వెళ్తుంటే కావాలని ధ్వంసం చేశారని మండిపడ్డారు. కుప్పంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని నాశనం చేశారని తెలిపారు. ఇంత జరిగినా.. టీడీపీ వాళ్లే కావాలని గొడవ పడ్డారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సజ్జల ఇలా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు పర్యటించకుండా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి విషయంపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి సజ్జలకు ఉన్న అర్హతేంటని చంద్ర శేషు  ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-27T00:52:51+05:30 IST