ఘనంగా అన్నదాన సత్రం వార్షికోత్సవం

ABN , First Publish Date - 2022-08-14T04:30:43+05:30 IST

కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్ర వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా అన్నదాన సత్రం వార్షికోత్సవం
నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

-కల్యాణోత్సవం నిర్వహించిన టీటీడీ పండితులు

-ఎమ్మెలే కోనప్ప సేవలు భేష్‌: అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి 

-హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ 

కాగజ్‌నగర్‌, ఆగస్టు 13: కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్ర వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన పండితులు నిర్వహించారు. అనంతరం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, జోగురామన్న, నడిపెల్లి దివాకర్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, జడ్పీచైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి తదితరులు సత్రం లో భోజనం చేశారు. సిర్పూరు ఎమ్మెల్యేకోనప్ప దంపతులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మంత్రిఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మె ల్యే కోనప్ప ఆకలితో ఉన్న పేదల కడుపు నింపడం ఎంతో గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలోనే ఇలా ఆలోచించే వారు తక్కువగా ఉన్నారన్నారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, జడ్పీవైస్‌చైర్మన్‌ కోనేరుకృష్ణారావు, కోనేరుచారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ కోనేరు వంశీ, ఎమ్మెల్యే సతీమణి కోనేరురమాదేవి, మున్సిపల్‌వైస్‌చైర్మన్‌ రాచకొండ గిరీష్‌ పాల్గొన్నారు. డీఎస్పీ కరుణాకర్‌, సీఐరవీందర్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2022-08-14T04:30:43+05:30 IST