ఉర్సు సందడి

ABN , First Publish Date - 2021-03-02T05:05:42+05:30 IST

ఉర్సు సందడి

ఉర్సు సందడి
అన్నారంషరీఫ్‌లో విన్యాసాలు చేస్తున్న ఫకీర్లు



పర్వతగిరి, మార్చి 1: అన్నారంషరీఫ్‌ యాకూబ్‌షావళి బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ముజా వర్లు గంధం(సందల్‌)ను ఊరేగింపుగా తీసుకువచ్చి బాబాకు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫకీర్ల ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు యాకూబ్‌ బాబా కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం రాత్రి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదా న కార్యక్రమాన్ని వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ రియాజ్‌పాషా, సూపరింటెండెంట్‌ ఆజాద్‌, సిబ్బంది పాల్గొన్నారు. మంగ ళవారం దీపారాధనతో ఉత్సవాలు ముగుస్తాయి.

దుగ్గొండి: సర్వమతాలకు చెందిన భక్తులు దర్గా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతకు చిహ్నంగా నిలువడం అభి నందనీయమని ఏసీపీ ఫణీందర్‌ అన్నారు. తిమ్మంపేట గుండంచెరువుకట్టపై ఉన్న సయ్యద్‌ యాకూబ్‌షావళి బాబా దర్గా ఉత్సవాల్లో భాగంగా సోమవారం దీపారాధ న, అన్నదానం చేపట్టారు. దుగ్గొండి, నర్సంపేట, నల్లబెల్లి, ఖానాపురం తదితర మండలాలకు చెందిన భక్తులు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో దర్గా నిర్వాహకుడు షేక్‌జబ్బర్‌, సర్పంచ్‌ విద్యాసాగర్‌తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:05:42+05:30 IST