దేవదాయ శాఖ కమిషనర్‌ పర్యటన

ABN , First Publish Date - 2022-07-01T06:37:00+05:30 IST

దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ శుక్రవారం నుంచి మూడురోజులపాటు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు గుంటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1గంటకు అన్నవరం చేరుకుంటారు.

దేవదాయ శాఖ కమిషనర్‌ పర్యటన

అన్నవరం, జూన్‌ 30: దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ శుక్రవారం నుంచి మూడురోజులపాటు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు గుంటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1గంటకు అన్నవరం చేరుకుంటారు. 3.30కు తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, 5గంటలకు పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయం, 6.30కు సామర్లకోట కుమారభీమేశ్వరస్వామి ఆలయం, 7.30కు బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయాలను దర్శించి 9 గంటలకు కపిలేశ్వరపురంలో బస చేయనున్నారు. తిరిగి శనివారం ఉదయం 6.50కు వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం, 8గంటలకు మందపల్లి మందేశ్వరస్వామి, మధ్యాహ్నం 2.15కు ద్రాక్షారామలో గల భీమేశ్వరస్వామి ఆలయం, 3.40కు కోటిపల్లి సోమేశ్వరస్వామి దేవాలయం, 5.15కు మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం, 6.40కు అయినవిల్లి వినాయక ఆలయాన్ని దర్శించి, దిండి రిస్సార్ట్స్‌లో బస చేయనున్నారు. ఆదివారం ఉదయం 8.45కు అంతర్వేది లక్ష్మీనరసింహ ఆలయం దర్శించి పాలకొల్లు వెళతారు.



Updated Date - 2022-07-01T06:37:00+05:30 IST