నేడు రామాలయ ధ్వజస్తంభ కళా అపకర్శ
ABN , First Publish Date - 2021-06-21T08:13:55+05:30 IST
రత్నగిరి క్షేత్రపాలకుడైన రామాలయ ధ్వజస్థంభ కళా అపకర్శ కార్యక్రమం సోమవారం 11 గంటలకు చేపట్టనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
అన్నవరం, జూన్ 20: రత్నగిరి క్షేత్రపాలకుడైన రామాలయ ధ్వజస్థంభ కళా అపకర్శ కార్యక్రమం సోమవారం 11 గంటలకు చేపట్టనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న ధ్వజస్థంభం శిథిలస్థితికి చేరడంతో రూ.18 లక్షలతో నిర్మించేందుకు లలిత ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ తయారు చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నూతన ధ్వజస్తంభం ఏర్పాటు జూలై 1నుంచి 3 వరకు వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.