రెవెన్యూ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ పూజలు

ABN , First Publish Date - 2021-03-01T05:56:06+05:30 IST

అన్నవరం, ఫిబ్రవరి 28: రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో ఆదివారం రెవెన్యూ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ ఉషారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె

రెవెన్యూ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ పూజలు
సత్యదేవుడి దర్శనానంతరం రెవెన్యూ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ

అన్నవరం, ఫిబ్రవరి 28: రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో  ఆదివారం రెవెన్యూ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ ఉషారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ఈవో త్రినాథరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేయగా ఈవో స్వామివారి ప్రసాదం అందజేశారు.

ప్రసాదం కోసం బారులు

తలుపులమ్మ లోవ దర్శనం చేసుకున్న భక్తులు ఆదివారం సాయంత్రం బైపాస్‌ నమూనాలయం వద్ద బారులు తీరారు. లోవ దర్శనం అనంతరం తిరుగుప్రయాణంలో భక్తులు సత్యదేవుడి ప్రసాదాలు కొనుగోలు చేసుకుని తమ స్వస్థలాలకు తీసుకెళ్తుంటారు. ఆదివారం లోవభక్తులు సుమారు 30వేల ప్రసాదం ప్యాకెట్లను భక్తులు కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-03-01T05:56:06+05:30 IST