నేడు టీడీపీ అభ్యర్థుల ప్రకటన
ABN , First Publish Date - 2021-02-28T06:45:09+05:30 IST
జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కార్పొరేటర్ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఆదివారం ప్రకటించనున్నది.
విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కార్పొరేటర్ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఆదివారం ప్రకటించనున్నది. నగరంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం రాత్రే నగరానికి చేరుకుని నాయకులతో సమావేశమయ్యారు. నాలుగైదు చోట్ల తప్ప మిగిలినచోట్ల అభ్యర్థుల మార్పు వుండదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా జీవీఎంసీ ఎన్నికల పరిశీలకుడు నిమ్మల రామానాయుడు కూడా శనివారం దక్షిణ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు.