మరో 233 పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2021-07-25T06:22:28+05:30 IST

జిల్లాలో శనివారం కొత్తగా 233 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరో 233 పాజిటివ్‌లు

మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

ఒంగోలు (కార్పొరేషన్‌), జూలై 24 : జిల్లాలో శనివారం కొత్తగా 233 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో 31, ఒంగోలు రూరల్‌లో 20, కందుకూరులో 15, శింగరాయకొండలో 15, అద్దంకిలో 11 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ కొవిడ్‌ కేసులు వెలుగుచూశాయి. కాగా గడిచిన 24గంటల్లో 246మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇద్దరు మరణించారు. దాంతోపాటుగా కొత్తగా మరో మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 224మంది ఫంగస్‌ బారిన పడగా, 115 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. 39 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Updated Date - 2021-07-25T06:22:28+05:30 IST