మరో 50 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-07-06T10:19:48+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది

మరో 50 కేసులు నమోదు

1385కు చేరిన బాధితుల సంఖ్య

15 మంది డిశ్చార్జి


కడప, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం 50 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కడపలో ఎన్జీవో కాలనీ, ప్రకాశ్‌నగర్‌, నభీకోట, మరాఠివీధుల్లో 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరులో 22, రాయచోటిలో 1, దువ్వూరులో 2, పులివెందులలో 2, సిద్దవటంలో 1, చాపాడులో 1, ఎర్రగుంట్లలో 1, వేంపల్లెలో 1, బద్వేలులో 1, మైదుకూరులో 4, సుండుపల్లెలో 1, వల్లూరు మండలంలో ఒక కేసు నమోదైంది. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 1385కు చేరుకుంది. 


15 మంది డిశ్చార్జి

కోవిడ్‌-19 బారిన పడి కడప ఫాతిమా కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న 15 మందిని డిశ్చార్జి చేసినట్లు కలెక్టరు హరికిరణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో జిల్లాలో ఇంతవరకు 485 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.


కరోనా అప్‌డేట్స్‌

మొత్తం శాంపిల్స్‌  78700

రిజల్ట్స్‌ వచ్చినవి  74426

నెగటివ్‌  73041

పాజిటివ్‌  1385

రిజల్ట్స్‌ రావలసినవి  4274

డిశ్చార్జ్‌  485

జూలై 5వ తేదీకి తీసిన శాంపిల్స్‌  1818

Updated Date - 2020-07-06T10:19:48+05:30 IST