డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై మరో కుల వివాదం కేసు

ABN , First Publish Date - 2021-10-28T01:23:42+05:30 IST

రాష్ట్ర డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై మరో కుల వివాదం కేసులో

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై మరో కుల వివాదం కేసు

విజయనగరం: రాష్ట్ర డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై మరో కుల వివాదం కేసులో కోర్టులో పిటిషన్ నమోదయింది. పుష్పశ్రీవాణి గిరిజన తెగకు చెందిన వ్యక్తి కాదంటూ ఏపీ షెడ్యూల్ ఏరియా ఆదివాసీ సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ట్రైబుల్ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. 


విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పుష్పశ్రీవాణి వైసీపీ తరపున పోటీచేసి గెలిచారు. జగన్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీవాణి ప్రమాణం స్వీకారం చేసారు. అయితే పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ గత కొంత కాలంగా వివాదం నడుస్తో్ంది. పుష్పశ్రీవాణి సోదరి రామ తులసిని ఎస్టీ కాదని పేర్కొంటూ ఆమెను ప్రభుత్వ ఉద్యోగం నుంచి గతంలో తొలగించారు. దీంతో పుష్పశ్రీవాణి కూడా ఎస్టీ కాదని పలువురు కోర్డుకు ఎక్కారు. అయితే తన సోదరిని  కులం కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించలేదని, నాన్ లోకల్ కారణంగానే ఉద్యోగం నుంచి రామ తులసిని తొలగించారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. అంతేకాకుండా తాము నిజమైన  ఎస్టీలమేనని పుష్పశ్రీవాణి వాదిస్తున్నారు. 

Updated Date - 2021-10-28T01:23:42+05:30 IST