ఐపీఎల్లో కరోనా కలకలం.. మ్యాచ్కు ముందు మరో ఢిల్లీ ఆటగాడికి..
ABN , First Publish Date - 2022-04-20T23:29:38+05:30 IST
ముంబై : ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన మరో ఆటగాడికి కరోనా సోకింది. కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణయ్యింది. ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు కొన్ని గంటల ముందు ఈ విషయం వెల్లడైంది.
ముంబై : ఐపీఎల్లో మరోసారి కొవిడ్ కలకలంరేగింది. ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన మరో ఆటగాడికి కరోనా సోకింది. కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణయ్యింది. ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు ముందు ఈ విషయం వెల్లడైంది. ఓ విదేశీ ఆటగాడు కొవిడ్ బారినపడినట్టు సమాచారం. కాగా మ్యాచ్ను రీషెడ్యూల్ చేయాలని ఆర్గనైజర్లు భావిస్తున్నట్టుగా సమాచారం.
ఇప్పటికే జట్టులోని ఐదుగురు ఆటగాళ్లకు కొవిడ్ నిర్ధారణయిన నేపథ్యంలో వ్యాప్తిని అడ్డుకునేందుకు పుణెలో జరగాల్సిన మ్యాచ్ను ముంబైలోని బ్రబోర్న్ స్టేడియానికి మార్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్లో కొవిడ్ సోకిన ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ వెల్లడించింది. ఫిజియోథెరపిస్ట్ ఫర్హాత్, చేతన్ కుమార్(స్టోర్ట్స్ మసాజ్ ఫిజియోథెరపిస్ట్), మిచెల్ మార్ష్, డాక్టర్ అభిజిత్ సాల్వీ(టీం డాక్టర్), ఆకాశ్ మానే(సోషల్ మీడియా కంటెంట్ టీం మెంబర్)ల పేర్లను బీసీసీఐ వెల్లడించింది.