సచివాలయంలో మరో ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2021-04-23T10:45:09+05:30 IST
అమరావతి సచివాలయంలో కరోనాతో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు కన్నుమూయగా.. తాజాగా మరో ఉద్యోగి కరోనాకు బలయ్యారు.
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): అమరావతి సచివాలయంలో కరోనాతో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు కన్నుమూయగా.. తాజాగా మరో ఉద్యోగి కరోనాకు బలయ్యారు. కార్మికశాఖలో సెక్షన్ అధికారి (ఎస్వో) శరత్చంద్ర గురువారం మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సచివాలయంలో కరోనా సెకండ్వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది. కొందరు చికిత్స పొందుతుండగా.. మరికొందరు హోం క్వారంటైన్లో ఉన్నారు.