మరో కుదుపు!
ABN , First Publish Date - 2020-08-08T09:53:55+05:30 IST
భద్రాచలం పట్టణ ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం నెల కొన్న పరిస్థితుల్లో వైద్యులు ఒకరి వెంట ఒకరు రాజీనామాలకు సన్నద్ధమవుతున్నట్టు
భద్రాద్రి ఏరియా వైద్యశాలలో మరో వైద్యుడి రాజీనామా?
ఇటీవల కాలంలో ఇది రెండో పరిణామం
భద్రాచలం, ఆగస్టు 7 : భద్రాచలం పట్టణ ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం నెల కొన్న పరిస్థితుల్లో వైద్యులు ఒకరి వెంట ఒకరు రాజీనామాలకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐసీయూ బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ కిషన్ ఇటీవల రాజీనామా పత్రాన్ని సమర్పించగా దానిని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ ఆమోదించలేదు. తాజాగా పది రోజుల క్రితం ఏరియా వైద్యశాల డీఎన్బీ జనరల్ మెడిసిన్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నాగేశ్వరరావు కూడా శుక్రవారం తన రాజీనామా లేఖను అందజేసినట్టు విశ్వసనీయ స మాచారం. ఇరువురు కీలక వైద్యులు రాజీనామా చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే వైద్యులు, సిబ్బంది కొరత ఎదుర్కొంటున్న వైద్యశాలకు ఈ ఇద్దరు వైద్యుల రాజీనామా నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది.