జిల్లాలో కరోనాతో మరొకరి మృతి
ABN , First Publish Date - 2020-07-06T11:16:07+05:30 IST
కరోనాతో జిల్లాలో ఆదివారం మరొకరు మృతిచెందారు. హైమద్పురా కా లనీకి చెందిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందా డు.
నిజామాబాద్ అర్బన్, జూలై 5: కరోనాతో జిల్లాలో ఆదివారం మరొకరు మృతిచెందారు. హైమద్పురా కా లనీకి చెందిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో జిల్లాలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య నాలుగుకు చేరింది. అలాగే ఆదివారం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నగరంలో ఒకటి, ఆర్మూర్ పట్టణంలో మరొకటి నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటి వ్ కేసుల సంఖ్య 150కి చేరింది.