ఆర్వోఎఫ్ఆర్ పట్టాలకు మరో అవకాశం
ABN , First Publish Date - 2020-12-04T05:02:05+05:30 IST
సబ్ప్లాన్ మండలాల్లోని గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల కోసం మరో అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు ఐటీడీఏ పీవో కూర్మనాథ్ తెలిపారు.
పార్వతీపురం: సబ్ప్లాన్ మండలాల్లోని గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల కోసం మరో అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు ఐటీడీఏ పీవో కూర్మనాథ్ తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సాగు హక్కు పట్టాల కోసం గిరిజను లు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలోని షెడ్యూల్డ్ ఉప ప్రణాళిక మండలా లతో పాటు మైదాన మండలాల్లో సాగు హక్కు పట్టాల కోసం ఐటీడీఏ పీవోకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న సాగు హక్కు పట్టాల కోసం ఆర్డీవో కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు.