మరో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-01-24T06:07:43+05:30 IST

అంగడిపేట ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న గండూరి వెంకట మ్మ(50) శనివారం సాయం త్రం మృతిచెందింది. దీంతో అంగడిపేట ప్రమాద మృతుల సంఖ్య 10కి చేరింది. పీఏపల్లి మండలం అంగడిపేట వద్ద ఈనెల 21న ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా, తీవ్రగాయాలతో ఏడుగురు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, అందులో నవీన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవరకొండ మండలం చింతబావికి చెందిన గండూరి వెంకటమ్మ(50) శనివారం సాయంత్రం మృతి చెందింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరుకుంది.

మరో మహిళ మృతి

10కి చేరిన అంగడిపేట ప్రమాద మృతుల సంఖ్య 

దేవరకొండ, జనవరి 23: అంగడిపేట ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న గండూరి వెంకట మ్మ(50) శనివారం సాయం త్రం మృతిచెందింది. దీంతో అంగడిపేట ప్రమాద మృతుల సంఖ్య 10కి చేరింది. పీఏపల్లి మండలం అంగడిపేట వద్ద ఈనెల 21న ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా, తీవ్రగాయాలతో ఏడుగురు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, అందులో నవీన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవరకొండ మండలం చింతబావికి చెందిన గండూరి వెంకటమ్మ(50) శనివారం సాయంత్రం మృతి చెందింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరుకుంది. కాగా, నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటమ్మ కూలీపని చేస్తూ కుటుంబానికి సాయంగా ఉంటోంది. ఆమెకు భర్త అంజయ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వెంకటమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. వెంకటమ్మ మృతితో చింతబాయి గ్రామంలో విషాదం అలుముకుంది.

Updated Date - 2021-01-24T06:07:43+05:30 IST