వలంటీర్ల సేవలకు మరో ఏడాది పొడిగింపు

ABN , First Publish Date - 2022-10-01T09:32:54+05:30 IST

గ్రామ, వార్డ్‌ సచివాలయాలల్లో పనిచేస్తున్న 2.60 లక్షల వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ, వార్డ్‌ సచివాలయాలశాఖ

వలంటీర్ల సేవలకు మరో ఏడాది పొడిగింపు

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డ్‌ సచివాలయాలల్లో పనిచేస్తున్న 2.60 లక్షల వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ, వార్డ్‌ సచివాలయాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఎంపిక చేసిన వలంటీర్ల గడువు ఈ ఏడాది ఆగస్టు 15తో ముగియడంతో ప్రభుత్వం వారి సర్వీసును వచ్చే ఏడాది ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వలంటీర్లకు ప్రభుత్వం ఏటా రూ.1560 కోట్లు గౌరవ వేతనాలను అందిస్తోంది. 

Updated Date - 2022-10-01T09:32:54+05:30 IST