భర్త ఇంటి ముందు ఆందోళన

ABN , First Publish Date - 2022-10-01T05:19:05+05:30 IST

మండలంలోని ఉద్దేహాళ్‌ గ్రామంలో సుధాకర్‌ రెడ్డి ఇంటి ముందు తన మొదటి భార్య మాదేశ్వరి, తల్లి మాదమ్మతో కలసి శుక్రవారం ఆందోళన చేపట్టింది.

భర్త ఇంటి ముందు ఆందోళన
తల్లి మాదమ్మతో కలసి బైఠాయించిన మాదేశ్వరి

 బొమ్మనహాళ్‌, సెప్టెంబరు 30 : మండలంలోని ఉద్దేహాళ్‌ గ్రామంలో సుధాకర్‌ రెడ్డి ఇంటి ముందు తన మొదటి భార్య మాదేశ్వరి, తల్లి మాదమ్మతో కలసి శుక్రవారం ఆందోళన చేపట్టింది. బాధితురాలు తెలి పిన వివరాల మేరకు కర్నూలు జిల్లా బేతంచెర్ల గ్రామానికి చెం దిన మాదేశ్వరితో సుధాకర్‌ రెడ్డి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా అన్యోన్యంగా వున్నప్పటికీ కొన్నేళ్ల నుంచి మనస్పర్థల వల్ల విడిపోయారు. ఈ నేపథ్యంలో సుధాకర్‌ రెడ్డి రెండవ వివాహం  చేసుకున్నాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని, నాకు న్యాయం చేయాలం టూ శుక్రవారం తల్లితో కలసి భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసి పెద్దల సమక్షంలో జీవనార్థం కోసం కొంత మేరకు డబ్బు ఇస్తామని నమ్మబలికి మోసం చేశారని ఆరోపించింది. నాకు న్యాయం చేయాలని ఆమె భీష్మించుకుని కూర్చుంది. 


Updated Date - 2022-10-01T05:19:05+05:30 IST