పెట్రో ధరలు తగ్గించాలని ఆందోళన

ABN , First Publish Date - 2021-03-01T06:21:33+05:30 IST

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ అడ్డరోడ్డు హైవే వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు ఆందోళన చేపట్టారు.

పెట్రో ధరలు తగ్గించాలని ఆందోళన

ఎస్‌.రాయవరం, ఫిబ్రవరి 28 : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ అడ్డరోడ్డు హైవే వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పదహారు సార్లు  పెంచారని, దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:21:33+05:30 IST