పెట్రో ధరలు తగ్గించాలని ఆందోళన
ABN , First Publish Date - 2021-03-01T06:21:33+05:30 IST
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అడ్డరోడ్డు హైవే వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు ఆందోళన చేపట్టారు.
ఎస్.రాయవరం, ఫిబ్రవరి 28 : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అడ్డరోడ్డు హైవే వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను పదహారు సార్లు పెంచారని, దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పాల్గొన్నారు.